రూపమే ముఖ్యం......!
ఆక్తావియో పాజ్
ఒక కవితలోని వాస్తవ భావాలు ఆ కవిత రాయటానికిముందు కవిలో ఉద్భవించినవి కావు.
రాసిన తరువాత ఉద్దేశ్యపూర్వకంగాగానీ, యాద్రుచ్చికంగాగానీ ఆ రచన ద్వారా వ్యక్తమయ్యేవే వాస్తవ భావాలు.
రూపం నుంచి వస్తువు ఉద్భవిస్తుంది. వస్తువు నుంచి రూపం కాదు.
ప్రతీ రూపం తనదయిన ఆలోచనకీ, తనదయిన ప్రాపంచిక దృష్టికీ జన్మనిస్తుంది.
రూపం అర్థ సంపన్నమై వుంటుంది.
అంతకన్నా ముఖ్యమయిన విషయం -
కళా ప్రపంచం లో అర్థ సంపన్నమై వుండేది కేవలం రూపం మాత్రమే.
కవిత్వం అర్థం కవి చెప్పాలని అనుకుంటూన్న దానిలో కాదు,
అంతిమంగా ఆ కవి వ్యక్తం చేసిన దానిలో వుంటుంది.
మనం చెప్పాలని అనుకుంటున్నది ,
వాస్తవంగా మనం చెప్పినదీ రెండూ ఒకటి కావు.
అవి పూర్తిగా భిన్నమయిన రెండు వేర్వేరు అంశాలు.
No comments:
Post a Comment