( పాత కాగితాలు సర్దుకుంటూ వుంటే మాస్టారి కవిత కనిపించింది. ఈ కవిత మాస్టారు డిక్టేట్ చేస్తుండగా నేను రాసింది. సందర్భం మొదటిసారి ఆయన కాలు విరగటం. ఆరోజు ' భ్రమణ కాంక్ష ' రచయిత ఆదినారాయణ తదితరులు ఉన్నారు. ఆయన పడిపోయిన రోజు మాస్టారి సహోద్యోగి తాటి శ్రీకృష్ణ ఆయనతోపాటు రాత్రంతా గడిపారు. మాస్టారు ఈ కవితకు శీర్షిక పెట్టలేదు . )
అచ్చుకాని ' మో ' కవిత
భ్రమణకాంక్ష
రమణమహర్షి
పక్కనే చాపకూడా లేని శ్రీకృష్ణ విన్యాసం
మేష్టారు పడుకుంటూ పడిపోయారు
మేష్టారు పడిపోతూ పడుకుంటారు
ఈ లోగా చెంబో తపేళో తెచ్సుసుకోవాలి కదా
ఈలోగా నా నిద్రార్ధరాత్రిలో
నేను నిద్రోతానేమోనని నా భయం
ఈలోగా టెలీఫోన్లన్నీ మోగుతుంటై అనుకో
అక్షరాలు ఆశ్చర్యా లవుతా యనుకో
నిమ్మళంగా నిదానంగా ఎవ్వడో ఎవడి చేతబడి పోయాడో
తెలియని దీన దుఃఖంలో
సూదిదారపు సందులో
తొమ్మిదో వెన్నుపూసలో
చిరుసవ్వడి ప్రేమపుష్ప సరాగలీనంలో
ఓసుకోమన్నాను కాదా
నా ఎడం కాలి ఆత్మని రక్తాక్షర బీజా లెవరిచ్చారో తెలీదు
ఓ గుండె పూల వాసనలకి
రక్తాన్ని సాపకింద కన్నీరులా పెట్టుకుని .....
మో కు జోహార్లు...
ReplyDelete